రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ప్రతి హీరో కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు.తమ హీరో జక్కన్న దర్శకత్వంలో సినిమా చేస్తే చూడాలని ఆనుకునే ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున ఉన్నారు.
మహేష్బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కాకుండా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు ఉంటాయని కన్ఫర్మ్ అయ్యింది.ఆ విషయాన్ని స్వయంగా రాజమౌళి ప్రకటించిన విషయం తెల్సిందే.
రికార్డు స్థాయి బడ్జెట్కు జక్కన్న పెట్టింది పేరు.అలాంటి రాజమౌళి సినిమాలో మహేష్బాబు ను అద్బుతంగా చూపించడం ఖాయం అంటూ అంతా చాలా బలంగా నమ్ముతున్నారు.ఈ సమయంలో కరోనా మహమ్మారి రావడంతో అంతా తలకిందులు అయ్యింది.ఆర్ఆర్ఆర్ చిత్రంను ఈ ఏడాదిలో పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవాళ్లు.
కాని కరోనా కారణంగా సినిమా ఎప్పటికి వచ్చేనో అర్థం కాని పరిస్థితి.
ఆర్ఆర్ఆర్ చిత్రంను వచ్చే ఏడాది వరకు జక్కన్న పూర్తి చేయలేడు.కనుక మహేష్బాబుతో సినిమా ప్రారంభం అవ్వాలంటే కనీసం రెండు సంవత్సరాలు అయినా పట్టే అవకాశం ఉంది.అంటే మహేష్బాబు ఫ్యాన్స్ ఆసినిమాను చూడాలంటే మరో రెండు సంవత్సరాలు అదనంగా వెయిట్ చేయాల్సి రావచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.