తెలుగులో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు 1999వ సంవత్సరంలో దర్శకత్వం వహించిన “రాజ కుమారుడు” అనే చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుందో చెప్పనవసరం లేదు.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించగా హీరోయిన్ గా బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింటా నటించింది.
కాగా ఈ చిత్రంలో ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ నటి సుమలత, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, సూపర్ స్టార్ కృష్ణ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ఈ చిత్రం విడుదలై నేటితో సరిగ్గా 21 సంవత్సరాలు కావస్తోంది.
అయితే అప్పట్లో ఈ చిత్రం అందుకున్న రికార్డులు మరియు కలెక్షన్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి.అయితే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు మహేష్ బాబు మామ అల్లుళ్ళ మధ్య సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.
దీంతో ఈ చిత్రం నైజాం సీడెడ్ ఏరియాలలో మంచి వసూళ్లను సాధించదడమే గాక బీ సి సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.
దీంతో ప్రస్తుతం కొందరు సినీ సెలబ్రిటీలు మరియు ప్రముఖులు ఈ చిత్రం విడుదలయి నేటితో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు కె.రాఘవేంద్రరావు కు మరియు చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మరికొంతమంది మహేష్ బాబు అభిమానులు ఈ చిత్ర పోస్టర్లను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ తెగ ట్రెండింగ్ చేస్తున్నారు.