దాదాపు రెండు దశాబ్దాల నుంచి వరుస విజయాలతో వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ బాబు.కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే మహేష్ చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించడంతో పాటు వరదలు, ఇతర సమస్యల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తన వంతు సాయం అందించి వార్తల్లో నిలిచారు.
మహేష్ బాబుకు చాలా సంవత్సరాల నుంచి మేకప్ మ్యాన్ గా పని చేస్తున్న పట్టాభి సూపర్ స్టార్ గొప్ప మనస్సు గురించి వెల్లడించారు.
తన వద్ద పని చేసే వాళ్ల విషయంలో మహేష్ ఏ విధంగా వ్యవహరిస్తారో.
వాళ్లు కష్టాల్లో ఉన్న సమయంలో ఏ విధంగా ఆదుకున్నారో పట్టాభి తెలిపారు.మహేష్ బాబు సుచనలతో తాను కొడుకును మెడిసిన్ లో మంచి కాలేజీలో చేర్పించానని.
అయితే ఒక సందర్భంలో కాలేజ్ ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బులు లేవని ఆ సమయంలో మహేష్ బాబు గారిని కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బును అప్పుగా ఇవ్వాలని కోరానని చెప్పారు.
తక్కువ మొత్తమైతే ఏదో ఒక విధంగా సర్దుబాటు అయ్యేదని కానీ ఎక్కువ మొత్తం కావడంతో మహేష్ బాబును అడగాల్సి వచ్చిందని తెలిపారు.అయితే తాను అప్పుగా డబ్బులు అడిగిన తరువాత మహేష్ బాబు అబ్బాయి చదివే కాలేజీకి సంబంధించిన వివరాలు అడిగారని ఇంకేం మాట్లాడలేదని అన్నారు.మహేష్ కు తాను చెప్పిన కొన్ని గంటలకే నమ్రత గారు కాల్ చేసి అబ్బాయి, కాలేజీ, ఇతర వివరాలను తెలుసుకున్నారని అన్నారు.
ఆ తరువాత మహేష్ బాబు పిలిచి డబ్బులు తిరిగి ఇవ్వనంటే మాత్రమే ఇస్తాననే కండీషన్ పై ఇచ్చారని తెలిపారు.ఆ తరువాత మహేష్ బాబు ఇచ్చిన చెక్ తో కాలేజీ ఫీజును చెల్లించానని వెల్లడించారు.మహేష్ బాబు గురించి పట్టాభి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం ఆయన గొప్ప మనస్సును ప్రశంసిస్తున్నారు.