సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని ఇంకా ప్రారంభించలేదు.గతంలో వంశీ పైడిపల్లితో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని చెప్పిన మహేష్, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను పక్కనబెట్టాడు.
ఇక గీతాగోవిందం చిత్ర దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ తన తాజా చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
కాగా తన తండ్రి కృష్ణ పుట్టినరోజైన మే 31న ఈ సినిమాను లాంఛ్ చేయాలని మహేష్ భావించాడు.కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా లాంఛ్ను వాయిదా వేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజలు కరోనా వైరస్ కారణంగా కష్టాలు పడుతుంటే, ఈ సమయంలో తన కొత్త చిత్రాన్ని ఎలా అనౌన్స్ చేయాలని మహేష్ సంధిగ్ధంలో పడ్డాడట.మరి మే 31న మహేష్ కొత్త చిత్రం ప్రారంభం అవుతుందా లేదా అనేది చూడాలి.