బాహుబలి సినిమా తర్వాత మన టాలీవుడ్ లో ఏ హీరో నోట విన్నా విన్నా పాన్ ఇండియా సినిమా అనే వస్తుంది.బాహుబలి ఇచ్చిన బూస్ట్ తో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు చేయడానికి దర్శక నిర్మతలు మాత్రమే కాదు చిన్న హీరోలు సైతం మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ చేసే అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలే.ప్రస్తుతం తన చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోతున్నారు.ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి కాబోతుంది.
మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మతంతో కూడా ఉన్నారు.ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాను 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఆ తర్వాత రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కబోతుంది.
ఆర్ ఆర్ ఆర్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ ను చరణ్ స్టార్ట్ చేయబోతున్నాడు.ఇది కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా దిల్ రాజు నిర్మించ బోతున్నాడు.ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాతో అల్లు అర్జున్ ఖచ్చితంగా హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ గా మారడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఇప్పటికే మహేష్ పాన్ ఇండియా సినిమాలు గురించి ఆలోచించడం లేదు.
ప్రస్తుతం చేస్తున్న సర్కారు సినిమా కూడా మామూలుగానే తెరకెక్కుతుంది.
అయితే వస్తున్నా సమాచారం ప్రకారం.మహేష్ కేవలం తెలుగు మార్కెట్ మీదనే ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.కేవలం తెలుగులోనే సూపర్ హిట్లు కొట్టి తన సినిమాలతో దేశం మొత్తం దద్దరిల్లేలా చేయాలనీ చూస్తున్నాడట.
వసూళ్ల పరంగా కూడా మహేష్ 100 కోట్లు ఎప్పుడో దరి పోయి 150 కోట్లు కూడా క్రాస్ చేస్తున్నాడు.అందుకే మహేష్ పాన్ ఇండియా సినిమాల మీద ద్రుష్టి పెట్టడం లేదట.
అందుకే పాన్ ఇండియా సినిమాలను లెక్కచేయని ఏకైక స్టార్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.