ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక రేంజ్ లో దూసుకుపోతుంది.ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమ డైరెక్టర్స్ , స్టార్ హీరోస్ అందరూ పాన్ ఇండియా సినిమా కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇకపై వాళ్ళ ఖాతాలో అన్ని పాన్ ఇండియా సినిమాలను వేసుకోవాలనుకుంటున్నారు.అంతేకాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ కూడా టాలీవుడ్ పై తెగ ఆసక్తి చూపుతున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇదివరకే పాన్ ఇండియా మూవీ లో నటించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆయన నటించిన సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే.
ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఆర్ఆర్ఆర్ కూడా పాన్ ఇండియా సినిమానే.ఇక పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా సినిమాలకే ఆసక్తి చూపుతున్నారు.
ఇదిలా ఉంటే వీరంతా పాన్ ఇండియా సినిమాలు ఆసక్తి చూపితే.మరో స్టార్ హీరో మహేష్ బాబు మాత్రం తన ఆలోచన పాన్ ఇండియా వైపే వెళ్లట్లేదని తెలుస్తుంది.
ప్రస్తుతం మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా పాన్ ఇండియా కాక పోయేసరికి.ఆ తరువాత డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న మరో ప్రాజెక్టు కూడా పాన్ ఇండియా సినిమా కాదనే తెలిసింది.ఇంతకీ మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలను చెయ్యాలనుకుంటున్నారా లేదా అని పక్కనబెడితే.మహేష్ బాబు ఆలోచనలో పాన్ ఇండియా మూవీ కాకుండా పాన్ వరల్డ్ మూవీ అనే ఆలోచన కూడా ఉందేమో అని అనిపిస్తుంది.
కానీ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సినిమా మాత్రం పాన్ ఇండియా అని సినీ వర్గాలు తెలుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా పై తొందర పడటం లేదని.
పైగా పాన్ ఇండియా కథలపై కోరిక కూడా లేదని అర్థమవుతుంది.