టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే సక్సెస్ను సొంతం చేసుకున్నాడు.ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టడంతో ఇది బ్లాక్బస్టర్ మూవీగా నిలిచింది.
ఇక ఈ సినిమా అందించిన సక్సెస్తో తన నెక్ట్స్ మూవీని దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.‘సర్కారు వారి పాట’ అనే టైటిల్తో రాబోయే ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావంతో ఆలస్యం అయ్యింది.
కాగా తాజాగా మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమాకు సంబంధించి మహేష్ ఓ ఆసక్తి కరమైన ట్వీట్ చేశాడు.ఈ సినిమా తనకు చాలా దగ్గరగా ఉంటుందని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో అతడు తరువాత ఖలేజా చిత్రం కోసం నటించడం చాలా బాగా అనిపించిందని మహేష్ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు ఉండేవని, అయితే సినిమా రిలీజ్ తరువాత అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోయిందని మహేష్ చెప్పుకొచ్చాడు.
అయితే ఈ సినిమా టీవీ ప్రేక్షకులను మాత్రం ఇంకా అలరిస్తూ వస్తోంది.
ముఖ్యంగా ఈ సినిమాతో మహేష్-త్రివిక్రమ్ కాంబో మరోసారి వస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు.కాగా త్రివిక్రమ్తో తాను త్వరలో మరో సినిమా చేయబోతున్నట్లు మహేష్ ఈ సందర్భంగా తెలిపాడు.
ఇక ఖలేజా చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్గా అనుష్క శెట్టి నటించగా, ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు.ఈ సినిమాకు మణిశర్మ అందించిన పాటలు శ్రోతలను ఇంకా అలరిస్తూ వస్తున్నాయి.
మరి త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ హ్యాట్రిక్ చిత్రం ఎప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.