మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.పరశురామ్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.పరశురామ్ ఈ సినిమాను సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తున్నాడు.
మహేష్ బాబు 27 వ సినిమాగా సర్కారు వారి పాట రూపొందుతుంది.ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలొకొన్నాయి.
ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.మహేష్ బాబు ఈ సినిమాలో బ్యాంకు మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రెల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో విలన్ గా అనిల్ కపూర్ నటిస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్ లో మలయాళ సీనియర్ హీరో జయ రామ్ నటించబోతున్నాడని తెలుస్తుంది.ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో చేయబోతున్నాడో అని ప్రేక్షకుల్లో ఒక ఆత్రుత మొదలైయ్యింది.
ఇప్పటికే చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి.
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యేలోపు సమయం పడుతుంది.
అందువల్ల ఈ గ్యాప్ లో మహేష్ మరొక సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.అయితే మహేష్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఫైనల్ అయ్యాడంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.మరి చూడాలి ఈ వార్తలో నిజమెంతో.