టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇప్పటికే దుబాయ్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.తాజాగా రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యి మళ్ళీ రెండు రోజులకే కరోనా కారణంగా వాయిదా పడింది.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.
ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 27 వ సినిమాగా రాబోతుంది.
ఈ సినిమాను పరశురామ్ బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తం గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే మహేష్ ఈ సినిమా తర్వాత రాజమౌళి తో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ఫిక్స్ అయ్యింది.
అయితే ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాకు పూర్తి అయిన తర్వాతే మహేష్ సినిమాపై రాజమౌళి ఫోకస్ పెడతాడు.
ఇది జరగడానికి ఇంకా చాలా టైం ఉంది.అందుకే మహేష్ ఈ గ్యాప్ లో మరొక రెండు సినిమా చేయడానికి రెడీ అయ్యాడని వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ఫిక్స్ అయ్యింది.
అయితే ఇప్పుడు మహేష్ మరొక తమిళ డైరెక్టర్ కు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.అది కూడా ఒక టాలెంటెడ్ మహిళా దర్శకురాలికి మహేష్ ఓకే చెప్పాడట.ఆమె పేరు సుధా కొంగర.
సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ నెక్స్ట్ సినిమా చేయ బోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ కాంబినేషన్ నిజంగానే వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.