సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ విడుదలకు సిద్దం అవుతోంది.ఏప్రిల్లో మహర్షి చిత్రం విడుదల అవ్వాల్సి ఉంది.
ఇక మరో వైపు ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో మహేష్ 26వ చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది.
అదుగో, ఇదుగో అంటూ జరుపుతూ వస్తున్నారు.ఇలాంటి సమయంలో సినిమా క్యాన్సిల్ అయ్యిందనే వార్త సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వస్తోంది.
మహేష్ బాబు 26వ చిత్రానికి సుకుమార్ కాకుండా అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తాడనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చక పోవడంతో సినిమా ఆలస్యం అవుతోంది.ఇప్పటికే పలు కథలు వినిపించిన సుకుమార్ ఒక్కదానితో కూడా మహేష్ ను మెప్పించలేక పోయాడట.దాంతో మరింత సమయం కావాలని సుకుమార్ కోరినట్లుగా తెలుస్తోంది.
సుకుమార్ కథకు మరో మూడు నాలుగు నెలల సమయం కోరడంతో ఈ గ్యాప్లో అనీల్ రావిపూడితో సినిమా చేసేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.అనీల్ రావిపూడి ఎఫ్ 2 చిత్రం సూపర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు.
దిల్రాజు ఒక ఎంటర్టైన్ మెంట్ కథను మహేష్ బాబుకు వినిపించి ఓకే చెప్పించాడు.
ప్రస్తుతం దిల్రాజు స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నాడు.వచ్చే నెల లేదా ఆ తర్వాత నెల మహేష్ 26వ మూవీ అనీల్ రావిపూడి దర్శకత్వంలో పట్టాలెక్కబోతుంది.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రెడీ అవుతుంది.
మరి కొన్ని రోజుల్లోనే వెలువడే అవకాశం ఉంది.మహేష్ బాబు, సుకుమార్ల మద్య వచ్చిన చిన్న గ్యాప్ను దిల్రాజు వాడేసుకునేందుకు సిద్దం అయ్యాడు.
కేవలం నాలుగు నెలల్లో సినిమాను పూర్తి చేసి ఇదే ఏడాది చివరి వరకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఆ తర్వాత అంటే మహేష్ 27వ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది.