సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఏర్పడగా, దానికి దర్శకుడు పరశురామ్ రూపంలో సమాధానం లభించింది.తొలుత వంశీ పైడిపల్లితో మహేష్ తన నెక్ట్స్ మూవీ చేస్తాడని అందరూ అనుకున్నా, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.
దీంతో మహేష్ను ఇంప్రెస్ చేయడంలో పరశురామ్ సక్సెస్ కావడంతో, మహేష్ తన కొత్త చిత్రాన్ని ఆయన డైరెక్షన్లో రూపొందించేందుకు పచ్చజెండా ఊపాడు.
కాగా ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు పరశురామ్ రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో మహేష్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఇక తాజాగా ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ‘‘సర్కారు వారి పాట’’ అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.పలు టైటిళ్లను పరిశీలించిన చిత్ర యూనిట్, ఎట్టకేలకే ఈ టైటిల్కే ఓటేసినట్లు తెలుస్తోంది.
ఇలాంటి టైటిల్స్ ప్రేక్షకుల్లో ఖచ్చితంగా ఆసక్తిని క్రియేట్ చేస్తాయని భావించిన చిత్ర యూనిట్ ఈ సినిమాకు ఇదే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో మహేష్ పాత్ర ఎలా ఉంటుందా, సినిమా కథ దేనికి సంబంధించింది ఉంటుందా, నటీనటులు ఎవరా అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాను మే 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ ఫైనల్ టైటిల్గా ఉంటుందా లేక మారుతుందా అనేది చూడాలి.