సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన “ఆగడు” సినిమా లో మహేష్ బాబు పోలీస్ గా కనిపించిన విషయం తెలిసిందే.ఆ సినిమాలో మహేష్ బాబు ఫన్నీ పోలీస్ గా కనిపించాడు.
పోలీస్ గా చేసిన పాత్ర నిరాశ మిగల్చడంతో మహేష్ బాబు మళ్ళీ ఆ జోనర్ వైపుకు వెళ్ళలేదు.మహేష్ ఈమధ్య భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి ని చేస్తున్నాడు.
ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.ఆ రెండు సినిమాల తర్వాత మహేష్ బాబు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్ధం అయ్యాడని సమాచారం అందుతోంది.
మహేష్ బాబుతో సందీప్ వంగ ఒక సినిమా చేయబోతున్నట్లుగా గత సంవత్సర కాలంగా వార్తలు వస్తున్నాయి.
కానీ ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి ముందు అడుగు పడింది లేదు.ఎట్టకేలకు సినిమా కథ సిద్ధం అయినట్లుగా సమాచారం అందుతోంది.తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి చెప్పిన కథకు మహేష్ బాబూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.అది ఒక పోలీస్ కథ అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా మొదలు కానుంది.
విజయ్ దేవరకొండతో బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి తీసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం బాలీవుడ్ లో తన సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్నాడు.ఈ ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయబోతున్నారు.కబీర్ సింగ్ సినిమా విడుదలైన తర్వాత మహేష్ మూవీకి స్పందించిన స్క్రిప్ట్ వర్క్ చేయబోతున్నాడు.
మహేష్ పోలీస్ అనగానే అభిమానులు ఆగడు నే గుర్తు చేసుకుంటున్నారు.మరి మహేష్ కు సందీప్ మంచి కాపీ మూవీ ని ఇస్తాడా చూడాలి.