టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది.కాగా ఈ సినిమా తరువాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడా అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
మహేష్ బాబుతో గతంలో ‘మహర్షి’ అనే సినిమాను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహేష్ మరో సినిమా చేయబోతున్నట్లు గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.అయితే ఈ కాంబోలో రాబోయే సినిమా గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
కాగా తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా మహేష్కు ఓ అదిరిపోయే కథను వినిపించాడని, ఈ సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.కానీ ఈ సినిమా గురించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదీ ఇప్పటివరకు రాలేదు.
దీంతో ఈ ఇద్దరిలో మహేష్ ఎవరితో సినిమా చేస్తాడా అనేది సస్పెన్స్గా మారిపోయింది.
ఇక వీరితో పాటు మహేష్ బాబుతో సినిమా చేసే డైరెక్టర్ల జాబితాలో దర్శకధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు.
కానీ వారిద్దరూ తమ నెక్ట్స్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇంకా చాలా సమయం పడుతుండటంతో మహేష్ ఎవరితో సినిమా చేస్తాడనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఏదేమైనా మహేష్ నెక్ట్స్ మూవీ గురించి కూడా అప్పుడే చర్చ సాగుతుండటంతో మహేష్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ నెలకొందో ఇట్టే అర్థమవుతోంది.
ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.