సోషల్ మీడియా ఇప్పుడు సెలబ్రిటీలకు ఒక స్పెషల్ ఫ్లాట్ ఫార్మ్ గా మారింది.పుకార్ల నుంచి సినిమా న్యూస్ ల వరకు అన్నిటిపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా అభిమానులతో కూడా చాలా దగ్గరగా ఉండడానికి వీలు పడుతోంది.
అందుకే స్టార్ హోరోలు ఎక్కువగా ట్విట్టర్ ని ఫాలో అవుతున్నారు.
మన టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ లో టాప్ లో కొనసాగుతున్నారు.మహేష్ 8 మిలియన్ ఫాలోవర్స్ ని అందుకున్నాడు.అంటే 80 లక్షల మంది ఫాలోవర్స్.
అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఏకైక తెలుగు హీరో అన్నమాట.అక్కినేని నాగార్జున 5.7M ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉన్నారు.
సౌత్ మొత్తంలో చూసుకుంటే మహేష్ రెండవ స్థానంలో ఉండగా 8.4మిలియన్స్ ఫాలోవర్స్ తో ధనుష్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.2010లో ట్విట్టర్ వరల్డ్ లోకి అడుగుపెట్టిన మహేష్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన సినిమాలపై అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు.మొదట్లో కాస్త స్లోగా స్పందించినప్పటికి మెల్ల మెల్లగా ట్వీట్స్ చేయడంలో స్పీడ్ పెంచారు.ప్రస్తుతం మహేష్ సరిలేరు నికేవ్వరు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.