సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కల నెరవేరింది.ఎంతగానే ఎదురు చూసిన వారి ఎదురు చూపులు ఇన్నాళ్లకు ఫలించాయి.
నిన్ననే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.మహేష్ బాబు షూట్ లో పాల్గొన్న ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయం చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేసారు.
ఇది ఇలా ఉండగా ఇటీవలే మహేష్ తన కొత్త లుక్ షేర్ చేయగా అది కాస్త వైరల్ విషయం తెలిసిందే.
అయితే ఈ లుక్ లోకి మహేష్ మారడానికి కారణం త్రివిక్రమ్ అని తెలుస్తుంది.
ఆయనే దగ్గరుండి మహేష్ కొత్త లుక్ ను డిజైన్ చేయించారట.ఈ లుక్ తోనే మహేష్ త్రివిక్రమ్ సినిమాలో కనిపించనున్నాడని టాక్ బయటకు వచ్చింది.ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాను ఈ సినిమా తెరకెక్కుతుంది.దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు.
ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.దీంతో ఇప్పుడు చేసే ఈ సినిమాపై అందరి ద్రుష్టి పడింది.
చూడాలి ఈ సినిమాతో వీరిద్దరూ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో.