కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యా్ప్తంగా ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో అన్ని రంగాల పనులు నిలిచిపోయాయి.
ఈ కారణంగా సినీ రంగానికి చెందిన చాలా మంది కార్మికులు పనిలేక సతమతమవుతున్నారు.దీంతో పలువురు ప్రముఖులు వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన పేద కళాకారుల సాయం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకు వచ్చాడు.లాక్డౌన్ కారణంగా పని లేకుండా పోయిన సినిమా కళాకారుల సహాయార్థం తనవంతుగా రూ.25 లక్షల సాయం అందిస్తున్నట్లు ప్రకటించాడు.ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన రూ.కోటి విరాళం ప్రకటంచాడు.ఇక మరో స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా తెలుగు సినీ కళాకారుల సహాయార్ధం తనవంతుగా రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించాడు.
ఇక వీరిని చూసి మిగతా స్టార్స్ కూడా తమవంతు బాధ్యతగా సాయం చేసేందుకు ముందుకు వస్తు్న్నారు.
కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ సమయాన్ని మరింత పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.