సరిలేరు నీకెవ్వరు లాంటి సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వాటి పాట సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి రెడీ అయ్యారు.ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఇక ఈ సినిమా కథ బ్యాంకు స్కాముల నేపధ్యంలో ఉంటుందని తెలుస్తుంది.
ఈ మధ్య కాలంలో దేశంలో ప్రముఖంగా విపించిన కార్పోరేట్ వ్యక్తులు బ్యాంకింగ్ కుంభకోణాల ఎలిమెంట్ ని ఇందులో ప్రత్యేకంగా చర్చించబోతున్నారు.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యి ట్రెండ్ సృష్టించింది.
ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా పరిస్థితలు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మొదలు పెట్టబోతున్నారు.అన్ని అనుకూలంగా జరిగితే నవంబర్ లో సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది.
ఈ సినిమా కథ ప్రకారం మహేష్ బాబు పాత్ర ఆరంభంలో అమెరికాలో ఉంటుంది.ఈ నేపధ్యంలో ఫస్ట్ షెడ్యూల్ ని అమెరికాలో మొదలు పెట్టాలని భావిస్తున్నారు.నెల రోజుల పాటు ఉండే ఫస్ట్ షెడ్యూల్ ని అక్కడ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.అయితే కరోనా పరిస్థితులు కుదుటపడితే కాని అమెరికాలో షూటింగ్ కి పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు.
ఈ నేపధ్యంలో దర్శకుడు పరశురాం ఎలా షూటింగ్ ప్లాన్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇది వరకు కనిపించని విధంగా సరికొత్త లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు.
ఫస్ట్ లో క్లాస్ టచ్ తో తరువాత మాస్ టచ్ లో మహేష్ బాబు పాత్ర ఉంటుందని తెలుస్తుంది.