హీరోలకి కొంత మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు.వాళ్లకి ఊహ తెలిసినప్పటి నుంచి సదరు హీరో అంటే ప్రాణం పెడతారు.
కొంత మంది అయితే తమ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు.అలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ చాలా తక్కువ మంది ఉంటారు.
వాళ్ళతో హీరోలకి కూడా మంచి అనుబంధం ఉంటుంది.అలాంటి ఫ్యాన్స్ చనిపోతే హీరోలు కూడా ఎమోషన్ అయిన సందర్భాలు కనిపిస్తాయి.
గతంలో చిరంజీవి వీరాభిమాని మరణిస్తే రామ్ చరణ్ నేరుగా అతని కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.వారి కుటుంబానికి అండగా నిలబడ్డారు.
ఇక పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఇలాగే ఇప్పుడు తెలుగు అగ్ర హీరో మహేష్ బాబు వీరాభిమాని దర్శి సురేష్ మరణించారు.
నెల్లూరు జిల్లా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆర్య వైశ్య బులియన్ మర్చంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దర్శి సురేష్ హఠాన్మరంతో మహేష్ బాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.
ఫ్యాన్స్ ప్రెసిడెంట్, ఘట్టమనేని కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటాడనే పేరున్న సురేష్ మరణవార్త విని మహేష్ తో పాటు ఆయన అభిమానులు కూడా విచారం వ్యక్తం చేశారు.సోషల్ మీడియాలో సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దర్శి లాంటి గొప్ప వ్యక్తిని పోగొట్టుకోవడం బాధాకరం.ఆయన కుటుంబానికి దైర్యం చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ మహేష్ ట్వీట్ చేశారు.
మొత్తానికి ఫ్యాన్స్ మరణంపై మహేష్ బాబు ఇంత హుందాగా స్పందించి ట్వీట్ చేయడంపై సూపర్ స్టార్ అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు.