సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సె్స్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్కు ప్రేక్షకులు పట్టం కట్టారు.
కాగా ఈ సినిమాకు టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.కాగా ఇందులో ‘మైండ్ బ్లాక్’ అనే పాట తాజాగా ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
యూట్యూబ్లో ఈ పాట ఏకంగా 100 మిలియన్ వ్యూస్ను దక్కించుకుని రికార్డు సృష్టించింది.దేవి అందించి క్యాచీ ట్యూన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
మహేష్ యాక్టింగ్, అనిల్ రావిపూడి టేకింగ్, విజయశాంతి పవర్ఫుల్ కమ్బ్యాక్ కలగలిసి ఈ సినిమాకు బ్లాక్బస్టర్ విజయాన్ని అందించిపెట్టాయి.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటించగా మైండ్ బ్లాక్ పాటలో ఆమె డ్యాన్స్కు ప్రేక్షకులు పట్టం కట్టారు.
మొత్తానికి సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమాతో మహేష్ నిజంగానే సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు.