సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో మహేష్ పడ్డాడు.
అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కరోనా మహమ్మారిపై యుద్ధానికి సినీ తారలందరూ ముందుకు వచ్చి నిరుపేద సినీ కార్మికులకు అండగా నిలిచారు.
ఇక ఈ క్రమంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని తారలందరూ పిలుపునిచ్చారు.అంతేగాక చాలా మంది స్టార్స్ తమను తాము స్వీయ నిర్భంధం చేసుకున్నారు.అయితే మహేష్ కూడా ఇటీవల స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు.ఇంటికే పరిమితం అయ్యి, తన అభిమానులకు కూడా ఇదే సూచించాడు.
అయితే సోషల్ మీడియాలో వస్తున్న పలు ఫేక్ న్యూస్లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని మహేష్ ప్రజలను కోరాడు.ఈ మేరకు తాజాగా ట్విట్టర్లో మహేష్ ట్వీట్ చేశాడు.కరోనా వైరస్పై పోరాడుతున్న వారందరికీ కృతజ్ఞతలు తెలపాలని ఆయన ఈ సందర్భంగా కోరాడు.