సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ హీరోల్లోకి అత్యధిక పారితోషికం తీసుకునే హీరో అనడంలో సందేహం లేదు.ప్రభాస్ తర్వాత స్థానంలో మహేష్ బాబు ఖచ్చితంగా ఉంటారు.
ప్రభాస్ ది పాన్ ఇండియా రేంజ్ కనుక ఆయన విషయం పక్కన పెడితే మహేష్ బాబు టాప్ రెమ్యూనరేషన్ కలిగిన హీరో అనడంలో సందేహం లేదు.మన హీరోలు పారితోషికాల విషయంలో ఇతర భాషల హీరోలను అనుసరిస్తున్నారు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ ఏకంగా వంద కోట్లను వసూళ్లు చేస్తున్నాడు.తన ప్రతి సినిమా కూడా రెండు వందల కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది.
కనుక అందులో వంద కోట్ల వరకు తనకు ఇవ్వాల్సిందే అంటూ విజయ్ డిమాండ్ చేస్తూ ఉంటాడు.ఇప్పుడు అదే పద్దతిని మహేష్ బాబు కూడా అవలంభించబోతున్నాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తో త్రివిక్రమ్ సినిమా కు గాను రాధాకృష్ణ ఏకంగా వంద కోట్ల ను పారితోషికంగా ఇవ్వబోతున్నాడు.పారితోషికం నో అంటే సినిమా లో వాటాను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ఇప్పుడు అదే మహేష్ బాబు టాప్ పారితోషికం మూవీ అంటున్నారు.సర్కారు వారి పాటకు గాను 75 కోట్ల పారితోషికంను అందుకుంటున్న మహేష్ బాబు తదుపరి సినిమా కు మాత్రం ఏకంగా వంద కోట్ల రూపాయల పారితోషికంను అందుకుంటున్నాడు.
తమిళ విజయ్ ను ఫాలో అవుతూ మహేష్ బాబు తీసుకున్న నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నారు.మొత్తానికి మహేష్ బాబు పారితోషికం విషయంలో తగ్గేదే లేదు అంటున్నాడు.ఆయన వరుసగా చేస్తున్న సినిమా లతో ముందు ముందు మరెంతగా వసూళ్లను తెచ్చి పెడతాయో చూడాలి.కొన్ని సినిమా లకు లాభాల్లో వాటాను దక్కించుకుంటున్న మహేష్ బాబు వంద కోట్లకు మించి తీసుకున్న దాఖలాలు ఉన్నాయి.
కాని ఈసారి మాత్రం వంద కోట్లను పారితోషికంనే తీసుకుంటున్నాడు.లాభాల్లో వాట ఆ తర్వాత ఉంటుంది.