ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మహేష్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.
అదే జోష్ లో మహేష్ బాబు పరశురామ్ తో ఈ సినిమా మొదలు పెట్టాడు.ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగింది.
ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను డైరెక్టర్ తెరకెక్కించాడు.
అయితే సెకండ్ షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా దుబాయ్ లో జరగాల్సిన షూటింగ్ హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు.
హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ మొదలవ్వగానే కరోనా కారణంగా మళ్ళీ వాయిదా పడింది.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంకు మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడు.ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నాడు.ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో మహేష్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడని టాక్.ఈ సినిమాలో మహేష్ వేసే ప్రతి పంచ్ మాస్ గాను ప్రత్యేక యాసలో కూడా ఉండనున్నాయట.ప్రతి డైలాగ్ మాస్ ఆడియెన్స్ ను మెప్పించే విధంగా ఉండడమే కాకుండా ఈ సినిమాలో ఆ డైలాగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని టాక్ నడుస్తుంది.
మరి చూడాలి ఎప్పుడు క్లాస్ గా ఉండే మహేష్ ఈసారి మాస్ డైలాగ్స్ ఎలా ప్రజెంట్ చేస్తాడో.