సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ విడుదలకు సిద్దం అయ్యింది అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా రీ షూట్ అంటూ వార్తలు వస్తున్నాయి.ఏప్రిల్ చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని అంతా ఎదురు చూస్తుండగా కనీసం నెల రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అంటే మే చివర్లో మహర్షి విడుదల అయ్యే అవకాశం ఉందన్నమాట.షూటింగ్ ఆలస్యం అయితే పర్వాలేదు కాని, కొన్ని షాట్స్ను రీ షూట్ అంటేనే అనుమానాలు పెరుగుతున్నాయి.
రీ షూట్ జరుపుకున్న సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
దారుణమైన ఫలితాలు సాధించిన సినిమాలు ఎక్కువగా రీ షూట్ చేసినవే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సెంటిమెంట్ ఉన్న సమయంలో ‘మహర్షి’ చిత్రం రీ షూట్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమాపై జనాల్లో ఆసక్తి పోతోంది.అయితే రీ షూట్ చేసినంత మాత్రాన పూర్తిగా సినిమా బాగాలేనట్లు ఏమీ కాదు.
కాని ప్రేక్షకులు మాత్రం సినిమా రీ షూట్ చేయడం వల్ల యూనిట్ సభ్యులకే సినిమా నచ్చలేదేమో అనే అనుమానాలు వస్తూ ఉంటాయి.అందుకే రీ షూట్ అనగానే చిత్రంకు ఒకరకమైన బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది.
రీ షూట్తో సినిమాపై అంచనాలు తగ్గుతాయని భావిస్తున్నారు.అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం అంచనాలు తగ్గినా సినిమా బాగుంటే తప్పకుండా రెండవ ఆట నుండే భారీగా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యి సినిమాకు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతాయని భావిస్తున్నారు.అందుకే రిష్క్ అయినా కూడా రీ షూట్కు వెళ్లడం మంచిది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్ముతున్నారట.పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.