సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట ఇంకా ప్రారంభం కాలేదు.వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
అంటే ఇంకా నాలుగు నెలలకు ఎక్కువ సమయం ఉంది.ఇక ఆ సినిమా చేయడానికి మరో ఆరు నెలల సమయం, విడుదలకు రెండు నెలలకు మించిన సమయం.
అంటే మొత్తంగా మహేష్ ప్రస్తుత సినిమా పూర్తి అవ్వడానికి ఏడాదికి మించి పడుతుంది.ఇలాంటి సమయంలో ఆయన కొత్త సినిమాను కమిట్ అయ్యాడు అంటూ వస్తున్న వార్తలను అభిమానులు ఎలా నమ్ముతున్నారు అంటూ ఆయన సన్నిహితులు ప్రశ్నించడం జరుగుతోంది.
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఒక చిత్రం చేయబోతున్నాడు.ఆయన బర్త్డే సందర్బంగా ఆ సినిమాకు సంబంధించిన వార్తలు రాబోతున్నాయి అంటూ ప్రచారం జరిగింది.
కాని ఆయన సన్నిహితుల మాటలను బట్టి చూస్తుంటే ఆ వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ తేలిపోయింది.ఇప్పటి వరకు మహేష్బాబు కొత్త సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
జక్కన్నతో సినిమాకు ముందు సర్కారు వారి పాట కాకుండా మరో సినిమా చేస్తాడు అనేది వాస్తవం అయినా కూడా అది లోకేష్ తో కాదు అంటూ పక్కాగా వారు చెబుతున్నారు.
మహేష్బాబు స్లో అండ్ స్టడీ మేనర్ లో సినిమాలు చేస్తున్నాడని ఆయన ఖచ్చితంగా సర్కారు వారి పాట చిత్రం పూర్తి అయ్యే వరకు మరో సినిమాను చేసే అవకాశం లేదు అంటున్నారు.ఒక వేళ సినిమా ప్రకటించినా అది ఇప్పట్లో ప్రకటించే అవకాశం లేదు.ఏడాది సమయం ఉండగానే సినిమాలను ప్రకటించడం కుదిరే పని కాదని కూడా వారు చెబుతున్నారు.
ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ విజయ్ ని డైరెక్ట్ చేస్తున్న లోకేష్ త్వరలో రజినీకాంత్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.కనుక మహేష్బాబుతో సినిమా వార్తలు పక్కా అబద్దం అయ్యి ఉంటాయి.
మరి అసలు విషయం ఏంటీ అనేది మరి కొన్ని గంటల్లో మహేష్ బర్త్డే సందర్బంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.