యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సినిమాలు విభిన్నంగా ఉంటాయి.అయితే ఈయన గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్నాడు.
అందుకే ఈయనకు ఒక హిట్ చాలా అవసరం అయ్యింది.కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు కమల్.
ఇక తాజాగా కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈయనకు హిట్ వచ్చినా చాలు అనుకుంటే విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు.ఈ ముగ్గురు కలయికలో సినిమా రావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు.
వారి ఎదురు చూపులు ఫలించేలా సినిమా ఉండడంతో ఫ్యాన్స్ ఖుషీ వ్యక్తం చేస్తున్నారు.
జూన్ 3న రిలీజ్ అయినా ఈ సినిమా అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో సూపర్ హిట్ మూవీగా నిలిచింది.సొంత బ్యానర్ లో కమల్ ఈ సినిమాను నిర్మించారు.
దీంతో ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.అందుకే కమల్ చాలా సంతోషంగా ఉన్నాడు.
ఇన్ని రోజులు అవుతున్న ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పోవడం లేదు.
ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాపై మహేష్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేసాడు.ఈ సినిమా అన్ని రకాలుగా మైండ్ బ్లోయింగ్ గా ఉంది అన్నారు.లోకేష్ కనకరాజ్ ను ఈ సినిమా షూటింగ్ గురించి అడిగి తెలుసుకుంటా అంటూ మహేష్ తెలిపారు.
ఇక కమల్ నటన గురించి అయితే నాకు మాట్లాడే అర్హత లేదు అని నేను ఆయన అభిమాని అయినందుకు గర్వంగా ఉంది అంటూ మహేష్ బాబు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.