మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి వారం పూర్తి చేసుకుంది.
మొదటి వారం రోజుల్లో ఈ చిత్రం 150 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.ఇక ఈ చిత్రం 100 కోట్ల షేర్ను దక్కించుకునేందుకు దూసుకు పోతుంది.
రికార్డు స్థాయిలో ఈ చిత్రం వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా కలెక్షన్స్ భారీ ఎత్తున సాధిస్తున్న నేపథ్యంలో అంతా కూడా అవాక్కవుతున్నారు.
ఇక ఈ చిత్రంపై మహేష్ బాబు పిల్లల రియాక్షన్ ఏంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.
చిన్న పిల్లలే అయినా కూడా మహర్షి చిత్రం వారికి బాగా నచ్చిందట.
మహర్షి చిత్రంను విడుదలకు ముందే చూసిన సితార మరియు గౌతమ్లు సినిమా పూర్తి అయిన తర్వాత చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారట.సినిమా పూర్తి అయ్యేప్పటికి సితార కన్నీళ్లు పెట్టుకోగా, గౌతమ్ తనను హగ్ చేసుకున్నాడు అంటూ మహేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
తన పిల్లల రియాక్షన్ చూసిన తర్వాత సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం కలిగింది.అయితే సినిమా నాకు విడుదలకు ముందు ఊహించిన దానికంటే ఎక్కువగా సంతృప్తిని ఇచ్చిందని మహేష్ బాబు చెప్పాడు.
సినిమా మొదలు పెట్టిన సమయంలో నా ఆలోచనలు, నా పద్దతులకు ఇప్పుడు నా ఆలోచనలు పద్దతులకు చాలా తేడా వచ్చిందని అన్నాడు.నాకు ఇప్పుడు పల్లెకు వెళ్లాలి, వ్యవసాయం ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కలుగుతోందని ఈ సందర్బంగా మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.మహేష్ బాబు 25వ చిత్రం అవ్వడంతో సినిమాపై మొదటి నుండి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా లేకున్నా కూడా సినిమా మంచి వసూళ్లను అయితే రాబడుతూ నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
.