సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారు.
ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో మహేష్ తన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ను ఇటీవల అనౌన్స్ చేశాడు.గీతాగోవిందం ఫేం చిత్ర దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కనున్న ఈ సినిమా సాలిడ్ సోషల్ మెసేజ్ను కూడా అందించనుంది.ఆర్థిక నేరాల బ్యాక్డ్రాప్తో ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంపై చాలా పేర్లు వినిపించినా, చివరకు ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ పేరు ఫైనల్ అయ్యింది.ఇక ఈ సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
ఇటీవల ఈ సినిమాలో ఆమె బ్యాంక్ ఉద్యోగినిగా పనిచేస్తుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే తాజాగా ఈ విషయంపై మరో అప్డేట్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో మహేష్ బ్యాంక్ మేనేజర్గా ఉంటాడని, అతడి వద్ద పనిచేస్తున్న ఉద్యోగినిగా కీర్తి సురేష్ కనిపిస్తుందని తెలుస్తోంది.మహేష్తో కీర్తి సురేష్ లవ్ ట్రాక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కానుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్కు స్టన్నింగ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.