ప్రస్తుతం దేశం మొత్తం కరోనా విలయతాండవం చేస్తోంది.కరోనా దెబ్బకు సామాన్యుల మొదలు సెలెబ్రెటీల వరకు ప్రాణలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ సెలెబ్రేటీల లిస్టులో చిరంజీవి నుండి మొదలుకొని డైరెక్టర్ అనిల్ రావిపూడి, రామ్ చరణ్, రాజశేఖర్ ఉన్నారు.అయితే ఒక్క రాజశేఖర్ మినహా అందరూ హోం ఐసోలేషన్ లో ఉండి కరోనా నుండి కరోనా నుండి విముక్తి పొందారు.
అయితే అనిల్ రావిపూడి కూడా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.అయితే కరోనా బారిన పడ్డ తరువాత ఎటువంటి విషయాలు వెల్లడించని అనిల్ రావిపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కరోనా సోకిందనే భావన నాలో రానివ్వలేదని, నా ఆలోచన మొత్తం స్క్రిప్ట్ లకు మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమయ్యానని దీంతో తొందరగా కరోనా నుండి బయట పడగలిగినానని భావిస్తున్నట్టు అనిల్ రావి పూడి తెలిపారు.అయితే ఇందులో భాగంగానే అనిల్ రావి పూడి చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
నేను క్వారంటైన్ లో ఉన్నప్పుడు మహేష్ రకరకాల మాటలతో నాలో ధైర్యాన్ని నింపాడని, సరదా సరదా మాటలతో ఎంతో రిలాక్స్ గా ఫీలయ్యానని, మహేష్ లో ఉండే ఆ సెన్సాఫ్ హ్యూమర్ నాకు ఎంతో ఆదర్శంగా ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు.