టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా సంక్రాంతి బరిలో పాన్ ఇండియా చిత్రాలు పోటీ పడటంతో ఈ సినిమా ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా పడింది.
అయితే కరోనా కారణం వల్ల పాన్ ఇండియా చిత్రాలు కూడా విడుదలకు నోచుకోలేదు.
ఏప్రిల్ ఒకటవ తేదీ మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ప్రకటించారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ ఒకటికి వాయిదా పడింది.దీంతో మరోసారి మహేష్ బాబు తన సినిమాని వాయిదా వేసుకోక తప్పలేదు.
ఇక ఈ సినిమా కూడా షూటింగ్ పనులను పూర్తిగా ఆపేశారు.మహేష్ బాబుకు మోకాలు సర్జరీ కావడంతో కొన్ని రోజుల పాటు షూటింగ్ వాయిదా వేయగా తర్వాత మహేష్ బాబు హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా బారిన పడటంతో వీరిద్దరిపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు వాయిదా పడ్డాయి.
ఇలా కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు.ఈ సినిమా తొందరగా పూర్తిచేసుకుని అనంతరం రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు పాల్గొన నున్నారు.దీన్ని బట్టి చూస్తే మహేష్ బాబు ఈ ఏడాది ఏమాత్రం తీరిక లేకుండా ఎంతో బిజీగా వరుస సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది.
ఇకపై మహేష్ బాబు ఒక్క రోజు కూడా తీరిక లేకుండా నిత్యం షూటింగ్లతో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు