సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యవసాయం చేయడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.అవును నిజంగానే మహేష్బాబు వ్యవసాయం చేయబోతున్నాడు, అది కూడా సేంద్రీయ వ్యవసాయం.
అయితే మహేష్ వ్యవసాయం చేయబోతున్నది రియల్ లైఫ్ లో కాదు, రీల్ లైఫ్లో.తన 25వ చిత్రం ‘మహర్షి’లో మహేష్బాబు వ్యవసాయం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
అమెరికాలో పెద్ద సంస్థకు అధినేత అయినప్పటికి స్నేహితుడి కోసం ఒక పల్లెటూరుకు వచ్చే మహేష్ బాబు అక్కడ సేంద్రీయ వ్యవసాయం చేస్తాడట.
పల్లెటూరు స్నేహితుడిగా అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న మహర్షి చిత్రం కోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ ఎత్తున పల్లెటూరు సెట్టింగ్ వేయబోతున్నారు.ఆ సెట్టింగ్లోనే మహేష్ బాబు మహర్షి చిత్రం తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ను దీపావళి తర్వాత మొదలు పెట్టబోతున్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.
పల్లెటూరుకు స్నేహితుడి కోసం వచ్చే మహేష్బాబు అక్కడ రైతులు పడుతున్న కష్టాలు చూసి చలించి పోయి, వారి కోసం సేంద్రీయ వ్యవసాయ పద్దతులను అక్కడ ప్రవేశ పెడతాడట.అలా రైతులకు సేంద్రీయ వ్యవసాయంలో మెలకువలు నేర్పడంతో పాటు, రైతుల బాగోగులు చూసుకుంటూ ఉంటాడట.ఆ క్రమంలో మహేష్బాబు కూడా రైతుగా మారిపోతాడని సమాచారం అందుతుంది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్బాబుకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.మహేష్ 25వ చిత్రం అవ్వడంతో అంచనాలు పతాక స్థాయిలో ఉన్నాయి.
భారీ ఎత్తున ఈ చిత్రాన్ని దిల్రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి పొట్లూరిలు నిర్మిస్తున్నారు.వచ్చే సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
.