టాలీవుడ్ ఇండస్ట్రీలో చారిత్రక సినిమాలతో గుణశేఖర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఇటు చారిత్రక కథల నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తూ ఉంటాడు.
భారీ సెట్టింగులతో పెద్ద బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడం గుణ శేఖర్ స్టైల్.ఆయన చివరి సారిగా అనుష్క తో కలిసి రుద్రమదేవి సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో వెంటనే మరొక సినిమా ప్రకటించాడు.రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడు చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తీయబోతున్నట్టు ప్రకటించాడు.టైటిల్ కూడా ‘ప్రతాపరుద్రుడు‘ అని రిజిస్టర్ చేయించాడు.మళ్ళీ ఇన్ని రోజులకు ఈ సినిమా గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చించు కుంటున్నారు.
ఈ సినిమాతో పాటు రానాతో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు.
హిరణ్యకశ్యప అనే టైటిల్ తో రానా దగ్గుబాటి హీరోగా సినిమా చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని చూసారు.అయితే అప్పుడే కరోనా స్టార్ట్ అవ్వడంతో ఈ సినిమా వాయిదా పడింది.
ఈ సినిమా ఇలా ఉండగానే సమంత హీరోయిన్ గా శాకుంతలం సినిమాను అనౌన్స్ చేసాడు.
ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లి 50 శాతం మేరకు పూర్తి చేసారు.
మళ్ళీ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడడంతో గుణశేఖర్ ప్రతాపరుద్రుడు స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట.అయితే ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం మహేష్ అయితే బాగుంటుందని గుణశేఖర్ అనుకుంటున్నాడట.ఇప్పటికే వీరి కాంబోలో ఒక్కడు, అర్జున్, సైనికుడు సినిమాలు వచ్చాయి.
ఇప్పుడు ప్రతాపరుద్రుడు లో కూడా మహేష్ అయితేనే బాగుంటుందని ఆయనను ఎలా అయినా ఒప్పించాలని గుణశేఖర్ ట్రై చేస్తున్నాడట.
మరి చూడాలి మహేష్ ఈ రోల్ చేయడానికి ఒప్పుకుంటాడా లేదో.