అయోమయంలో పడ్డ మహేష్.. ఎందుకో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది.దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇచ్చిన బూస్ట్‌తో మహేష్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ఓకే చేశాడు.

 Mahesh Babu In Dilemma After Sarkaru Vaari Paata, Mahesh Babu, Sarkaru Vaari Paa-TeluguStop.com

గీతాగోవిందం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన పరశురామ్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని రెడీ చేసేందుకు మహేష్ ఓకే అనేశాడు.

‘సర్కారు వారి పాట’ అనే ఆసక్తికర టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.కాగా ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టకముందే మహేష్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమా మొదలయ్యేసరికి చాలా సమయం పడుతుండటంతో ఈ గ్యాప్‌లో మహేష్ మరో సినిమా చేయాలని చూస్తు్న్నాడు.

కాగా ఈ సినిమాను ఎవరితో చేస్తాడా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిపోయింది.ఇప్పటికే మహేష్‌తో సినిమా చేసేందుకు ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు క్యూ కట్టారని వార్తలు వస్తున్నాయి.

అయితే వారిలో మహేష్ ఎవరితో సినిమా చేస్తాడా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిపోయింది.ముగ్గురు కూడా మాస్ చిత్రాల స్పెషలిస్టులు కావడంతో, మహేష్‌ను ఎవరు సరిగ్గా హ్యాండిల్ చేయగలరా అనేది ఆసక్తిగా మారింది.

మరి వారిలో మహేష్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube