సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంకు మిశ్రమ స్పందన వచ్చింది.అయితే కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి.
అల వైకుంఠపురంలో సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గాయి.అయినా కూడా యూనిట్ సభ్యులు ప్రమోట్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు.
ఈ చిత్రంను ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషనల్ ఈవెంట్స్తో పాటు పలు ఇంటర్వ్యూలు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.కాని సినిమాకు మాత్రం ఆశించిన స్థాయిలో షేర్ దక్కడం లేదు.
వారం రోజులు అయిన తర్వాత సినిమా ప్రమోషన్కు మహేష్బాబు గుడ్ బై చెప్పేసినట్లుగా సమాచారం అందుతోంది.ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు గుడ్ బై చెప్పేసిన మహేష్బాబు అమెరికా వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం ఇంకో రెండు మూడు రోజులు ప్రమోషన్స్ చేస్తే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
అయితే ఇప్పటికే మహేష్బాబు కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా చెక్కేశాడు.దాదాపు మూడు లేదా నాలుగు వారాల పాటు అక్కడే ఉండే అవకాశం ఉంది.