సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు మహేష్ అభిమానులు.
అయితే ఈ సినిమా తరువాత మహేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటా అనే సందేహం అందరిలోనూ ఉంది.
ఇప్పటివరకు మహేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెప్పలేదు.దీంతో మహేష్ ఫ్యా్న్స్ ఆయన తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆ సినిమా ఎవరితో చేస్తాడా అనే సందేహం కూడా వారిలో నెలకొంది.కాగా సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రమోషన్స్లో భాగంగా మహేష్ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు.
మహేష్ బాబుతో మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించి వంశీ ఆయనకు ఓ స్టోరీలైన్ వినిపించాడని, ప్రస్తుతం ఆ స్క్రిప్టు వర్కులో వంశీ బిజీగా ఉన్నారని మహేష్ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి మహేష్ తన నెక్ట్స్ మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ మరోసారి వంశీ పైడిపల్లికి ఇవ్వడంతో ఆ సినిమా ఎలాంటి సబ్జెక్ట్తో వస్తుందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.