సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనిపించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఎప్పుడు లేని విధంగా ఈ చిత్రంలో కామెడీ ఫుల్ గా చేయడంతో పాటు కాస్త శృతిమించిన రొమాన్స్ను కూడా ఈ చిత్రంలో రష్మికతో చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
అలాగే ఈ చిత్రంలో విజయశాంతితో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెల్సిందే.సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి.
ఆ అంచనాలు మరింత పెంచేలా ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తున్నారు.
ఈనెల 5వ తారీకున భారీ ఎత్తు సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరుపబోతున్నారు.ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.ఈ నేపథ్యంలో ఈ చిత్రంకు ప్రత్యేకంగా తానే హోస్ట్గా వ్యవహరించాలని మహేష్బాబు నిర్ణయించుకున్నాడు.
ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరో కూడా తన సినిమాకు తానే హోస్టింగ్ చేసుకున్న దాఖలాలు లేవు.ముఖ్యంగా స్టార్ హీరోలు స్టేజ్ పై పిలిస్తే వెళ్లి మాట్లాడటం తప్ప అంతకు మించి మాట్లాడే సందర్బాలు చాలా తక్కువ.
అలాంటిది మహేష్బాబు హోస్టింగ్కు సిద్దం అయ్యాడు.
సూపర్ స్టార్ హోస్టింగ్ అనగానే అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు.సుమ హోస్టింగ్ చేయడం కన్ఫర్మ్.అయితే చివర్లో గెస్ట్లను పిలిచే సందర్బంగా మహేష్బాబు మైక్ అందుకోబోతున్నాడట.
మహేష్బాబు స్వయంగా స్టేజ్ పైకి చిరంజీవిని ఆహ్వానించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈమద్య కాలంలో చిరంజీవి చాలా ఫంక్షన్స్కు హాజరు అవుతున్నాడు.
మహేష్ బాబు సినిమా ఫంక్షన్కు హాజరు కాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ప్రీ రిలీజ్ వేడుకపై ఉంది.ఆ రోజు మెగా మరియు సూపర్ స్టార్స్ ఫ్యాన్స్కు పండుగే కావచ్చు.