సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో ఎంతో బిజీగా ఉన్నారు.పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించనున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం త్రీ షెడ్యూల్స్ పూర్తి చేసుకొని నాలుగవ షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉంది.ఈ షెడ్యూల్ పూర్తి కాగానే మహేష్ బాబు ఈ నెల ఆఖరికి స్పెయిన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల ఆఖరిగా స్పెయిన్ లో జరిగేటటువంటి టాకీ సన్నివేశాలతో పాటు రెండు పాటల చిత్రీకరణ జరగనుంది.సుమారు నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ ప్లాన్ చేసిన చిత్ర బృందం ఈ నెల ఆఖరికి స్పెయిన్ వెళ్లనున్నారు.
స్పెయిన్ లో జరిగే ఈ షెడ్యూల్ తర్వాత డిసెంబర్లో మరొక షెడ్యూల్ చిత్రీకరణ ఉంటుందని ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీత దర్శకత్వం వహించగా.నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేశ్బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఇందులో మహేష్ బాబు సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.సర్కారు వారి పాట చిత్రం పూర్తికాగానే మహేష్ త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.