గత ఏడాది రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ ఇప్పటి వరకు తదుపరి చిత్రాన్ని ప్రారంభించలేదు.రంగస్థలం చిత్రం విడుదలైన వెంటనే మహేష్బాబు 26వ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను సుకుమార్ దక్కించుకున్నాడు.
మహేష్బాబు కోసం రెండు నెలల్లో సుకుమార్ స్క్రిప్ట్ను సిద్దం చేశాడు.అయితే ఆ స్క్రిప్ట్ రజాకార్ల నేపథ్యంలో అవ్వడంతో మహేష్బాబు ఆసక్తి చూపించలేదు.
ఆ కథతో సినిమా చేయడం ప్రస్తుతం తనకు ఇష్టం లేదని, మరేదైనా కథతో సినిమా చేద్దాం అంటూ సుకుమార్కు మహేష్బాబు చెప్పాడట.మొదట సరే అంటూ చెప్పిన సుకుమార్ ఆ స్క్రిప్ట్నే మళ్లీ మళ్లీ మహేష్ బాబుకు వినిపించాడట.
ప్రస్తుతం అన్ని అలాంటి నేపథ్యంలోనే సినిమాలు వస్తున్న కారణంగా తనకు ఆ నేపథ్యంలో సినిమా చేయడం ఇష్టం లేదని మహేష్ బాబు చెప్పాడట.అదే కథతో సినిమా చేద్దామని సుకుమార్ బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశాడు.తప్పకుండా నేను సూపర్ హిట్ చేస్తాను అంటూ మాట ఇచ్చాడట.అయినా కూడా మహేష్ బాబుకు మాత్రం ఆసక్తి, నమ్మకం కలగలేదు.దాంతో అనీల్ రావిపూడితో తదుపరి చిత్రానికి కమిట్ అయ్యాడు.మహేష్ బాబు వంటి స్టార్తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోవడంను కొందరు తప్పుబడుతున్నారు.
మహేష్బాబుకు నచ్చేలా స్క్రిప్ట్ తయారు చేస్తే బాగుండేది.
మహేష్బాబు సినిమాను వదులుకున్న సుకుమార్ పెద్ద తప్పు చేశాడు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రంగస్థలం చిత్రం తర్వాత మరో బ్లాక్ బస్టర్ను మహేష్బాబుతో ఇస్తే సుకుమార్ స్థాయి మరింతగా పెరిగేది అనేది సినీ వర్గాల వారి అభిప్రాయం.కాని సుకుమార్ మాత్రం పంతానికి పోయి మహేష్ బాబు సినిమాను వదులుకున్నాడు.
సుకుమార్ రంగస్థలం చిత్రం సక్సెస్ అవ్వడంతో ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నాడని, ఆయన ఇప్పటికి అయినా ఆ కాన్ఫిడెన్స్ను తగ్గించుకోవాలంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.సుకుమార్ తదుపరి చిత్రం అల్లు అర్జున్ హీరోగా చేయబోతున్న విషయం తెల్సిందే.