సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.ఈయన వరుస హిట్స్ అందుకుంటూ నెంబర్ వన్ హీరోగా దూసుకు వెళుతున్నాడు.
ఈయన తన కెరీర్ లో ఎన్నో సరికొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.అలాగే కొన్ని సందేశాత్మక సినిమాలు సైతం తీశారు.
ఇవ్వన్నీ కూడా మంచి హిట్ అవ్వడమే కాకుండా 100 కోట్లు సైతం రాబట్టినవి ఉన్నాయి.
అయితే మహేష్ సినిమాలకు ఒకానొక సమయంలో రొటీన్ సినిమాలు చేస్తున్నాడు అని ఆయన ఫ్యాన్స్ నుండే కామెంట్స్ వినిపించాయి.
మరి ఇప్పుడు మాత్రం ఈయన లైనప్ భారీగా ఉంది అని చెప్పాలి.ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకుని ప్రెజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్నాడు.
అలాగే ఈ సినిమా తర్వాత అగ్ర రాజమౌళి దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా ఉంది.మరి ఈ భారీ లైనప్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అని చెప్పాలి.
ఇదిలా ఉండగా తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ్ సినిమా వారిసు విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారట.
ఎందుకంటే ఈ సినిమా మహేష్ దగ్గరికి వెళ్లి నెక్స్ట్ విజయ్ దళపతి దగ్గరికి వచ్చింది అని టాక్ వచ్చింది.మరి తాజాగా రిలీజ్ అయిన వారసుడు ట్రైలర్ చూస్తుంటే మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా మహేష్ వదులుకుని మంచి పని చేసాడని.ఇది చేసి ఉంటె మరో రొటీన్ సినిమా ఈయన ఖాతాలో పడేది అనే టాక్ మొదలయ్యింది.
మరి దిల్ రాజు ఎంతో నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టి మరీ తీసిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో సంక్రాంతి వరకు వేచి ఉండాల్సిందే.