డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 5 న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న సంగతి అందరికీ విదితమే.ఈ సందర్భంగా ప్రముఖులు, విద్యార్థులు ఇలా అందరూ వారివారి గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా, డైరెక్ట్ గా కలిసి పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారు.
అయితే ఇందుకు సంబంధించి తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ఎమోషనల్ పోస్టును చేశారు.
ఇందుకు సంబంధించి న ట్విట్టర్ లో మహేష్ బాబు… ‘ అభ్యాసానికి ఎలాంటి హద్దులు ఉండవని, ప్రస్తుతం కరోనా లాంటి మహమ్మారి ఈ సమయంలో కూడా విద్యార్థులకు అవసరమైన విద్యను అందించడానికి వారి వంతు కృషి చేస్తున్న ఉపాధ్యాయులందరికీ, వారితో పాటు… తాను ప్రేరణ పొందడానికి సహాయపడినవారికి, అలాగే కొన్ని నేర్చుకోవడానికి తనకు ఎంతో సహాయం చేసిన వారికి మరియు తనకి మార్గదర్శకులుగా నిలిచిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని తెలుపుతూ… ‘ హ్యాపీ టీచర్స్ డే ‘ అని సూపర్ స్టార్ ట్వీట్ చేశాడు.
ఇకపోతే ఈ సంవత్సరం మొదట్లో సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో భారీ హిట్ ను సొంతం చేసుకున్న మహేష్ బాబు, ప్రస్తుతం దర్శకుడు పరశురాం తో కలిసి సర్కార్ వారి పాట అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు.