తాజాగా ఘట్టమనేని ఇంట్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి ఆరోగ్యం కారణంగా తాజాగా మరణించిన విషయం తెలిసిందే.
ఇందిరా దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే.ఇందిరా దేవి మరణంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి.
ఇంద్ర దేవి మరణంతో ఘటమైన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా సుఖ సంద్రంలో మునిగిపోయారు.
తల్లి మృతదేహం వద్ద మహేష్ బాబు కన్నీరు మున్నీరుగా విలపించారు.
కూతురు సితార కూడా నానమ్మ మృతదేహం వద్ద ఫుల్ ఎమోషనల్ అయ్యింది.మహేష్ బాబు, నమ్రత ఓదారుస్తున్నప్పటికీ సితార మాత్రం వెక్కివెక్కి ఏడ్చేసింది.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక నిన్న మహేష్ బాబు తన తల్లి అంతక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే.
తన తల్లి ఇందిరా దేవి జ్ఞాపకాలను తలచుకుంటూ నటుడు మహేశ్బాబు భావోద్వేగానికి లోనయ్యారు.
మాతృ మూర్తి అంత్యక్రియలు పూర్తయిన తరువాత సోషల్ మీడియాలో ఇందిరా దేవీ కు సంబంధించి ఓ పాత ఫొటోను షేర్ చేశారు.
ఆ ఫోటోని షేర్ చేస్తూ బరువెక్కిన హృదయంతో ఏమి రాయకుండా లవ్ ఎమోజీలను జతచేశారు మహేష్.కాగా ఈ పోస్ట్ పై పలువురు ప్రముఖులు, లక్షల సంఖ్యలో నెటిజన్స్, అలాగే మహేష్ అభిమానులు స్పందించారు.కొందరు మహేష్ బాబు కు దైర్యంగా ఉండంdడి అంటూ దైర్యం చెబుతున్నారు.కొందరు అభిమానులు అన్నా మేం మీతో ఉన్నాం అన్న.బాధపడకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇకపోతే మహేష్ కీ తన తల్లి అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే.
ఆమె ఆశీస్సుల వల్లే ఈ స్థాయికి వచ్చానని ఆమెపై ఉన్న ప్రేమను మహేశ్ పలు సందర్భాల్లో చాటారు.అలాగే పలు సార్లు వేదికపై తన తల్లిని తలచుకొని ఎమోషనల్ అయ్యారు మహేష్.