సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు నిన్న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.దీంతో టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది.
ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటూ టాలీవుడ్ చిత్ర సీమ లెజెండరీ నటులను, దర్శక నిర్మాతలను కోల్పోతుంది.తాజాగా మరొక హీరో కన్ను మూయడం చిత్ర సీమను దిగ్బ్రాంతికి గురి చేస్తుంది.
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు మహేష్ బాబు అన్నయ్య ఘట్టమనేని రమేష్ బాబు మరణ వార్త విని టాలీవుడ్ అంత షాక్ అయ్యారు.ఆయన అకాల మరణం టాలీవుడ్ ఇండస్ర్టీ ని విషాదం లోకి నెట్టేసింది.
ఒకవైపు మహేష్ బాబు కరోనా తో బాధ పడుతున్నాడని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.ఇక మరొక వైపు ఆయన అన్నయ్య మరణం తో అందరు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
రమేష్ బాబు అనారోగ్యంతో నిన్న రాత్రి మరణించిన విషయం తెలిసిందే.ఆయన దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధ పడుతున్నారని సమాచారం.నిన్న రమేష్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్ కు ఆయనను తరలించారు.
ఈయన అంత్యక్రియలు ఈ రోజు ముగిసాయి.జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం లో మధ్యాహ్నం అంత్యక్రియలు ముగిసాయి.ఐతే కరోనా కారణంగా మహేష్ అన్న రమేష్ బాబు అంత్యక్రియలలో పాల్గొనలేదు.
తన అన్నయ్యను కడసారి చూసేందుకు కూడా వీలు లేకుండా పోయింది.దీంతో మహేష్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.తన అన్న అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేక పోవడంతో సోషల్ మీడియా వేదికగా ఆయన ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య అంటూ మహేష్ ఆవేదన వ్యక్తం చేసారు.
”మీరు నాకు స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం, నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం ఉండేవాడిని కాదు.మీరు నా కోసం చేసిన ప్రతిదానికి ధన్యవాదములు.నాకు మరొక జీవితంలో కూడా నువ్వే అన్నయ్యగా ఉంటావు.ఇప్పటికీ ఎప్పటికి నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యాడు మహేష్.