టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అదిరిపోయే బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దాడు.
ఇక ఈ సినిమా అందించిన సక్సెస్తో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు మహేష్.గతంలో గీతాగోవిందం వంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ను అందుకున్న దర్శకడు పరశురామ్ డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ కూడా చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు మహేష రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే టైటిల్ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేయగా, ఈ సినిమా కథ ఆర్థిక నేరాలకు సంబంధించిన రివెంజ్ డ్రామాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో మహేష్ మునుపెన్నడూ చేయని ఫీట్ను చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో మహేష్ బాబు డ్యుయెల్ రోల్లో నటించేందుకు సిద్ధమయ్యాడట.
రెండు భిన్నమైన స్వభావాలు కలిగిన ట్విన్స్ పాత్రల్లో మహేష్ నటించనున్నట్లు తెలుస్తోంది.
బాలనటుడిగా మహేష్ డ్యుయెల్ రోల్ చేసినా, హీరోగా మారిన తరువాత డ్యుయెల్ రోల్ చేయలేదు.దీంతో ఇప్పుడు మహేష్ తొలిసారి డ్యుయెల్ రోల్లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తోండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ సినిమాలో మహేష్ డ్యుయెల్ రోల్ ఎలా ఉండబోతుందా అనేది ఆసక్తగా మారింది.