సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు మురుగదాస్ రూపొందించనున్న భారి చిత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.లండన్ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం సినిమా స్క్రిప్టు మీద కుస్తీ పడుతున్నాడు.
వాస్తవానికి జులై 15న ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాలి.కాని ఏవో కారణాలతో జులై 29కి సినిమా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసారు.
అందుకు మహేష్ బాబే కారణమని ఫిలింనగర్ కబురు.
ఇక ఈ సినిమా గురించి వినబడుతున్న మరో రూమర్ ఏమిటంటే సూపర్ స్టార్ ఇందులో డబుల్ రోల్ లో కనిపిస్తాడట.
ఒకటి ఇంటలిజెన్స్ అఫీసర్ గా, మరొకటి ప్రొఫేసర్ గా.ఇందులో మహేష్ బాబుది లాయర్ పాత్ర అని, డబుల్ రోల్ కాదని చెప్పేవారు కూడా ఉన్నారు.ప్రస్తుతానికైతే ఇవన్ని గాలివార్తలే.మురుగదాస్ చెప్పేదాకా ఏ విషయాన్ని నమ్మడానికి వీల్లేదు.
కాని హీరోగా కెరీర్ మొదలుపెట్టాక మహేష్ బాబు ఎప్పుడు డబుల్ రోల్ లో కనిపించలేదు.అందుకే ఊహాగానాలు కూడా ఆయన అభిమానులకి ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.
పరిణీతి చోప్రా సూపర్ స్టార్ సరసన ఆడిపాడనున్న ఈ చిత్రానికి ఎన్వీప్రసాద్ నిర్మాత.వచ్చే వేసవిలో సినిమా విడుదల అవుతుంది.