టాలీవుడ్ హీరోల పారితోషికాలు బాలీవుడ్ హీరోల స్థాయిని దాటుతున్నాయి.బాలీవుడ్లో హీరోలు 20 నుండి 30 కోట్ల వరకు తీసుకుంటారు అనే టాక్ ఉంది.
ఇక టాలీవుడ్లో కూడా కొందరు హీరోలు బాలీవుడ్ హీరోల స్థాయిలో పారితోషికాన్ని తీసుకుంటుండగా, మరి కొందరు ఏకంగా బాలీవుడ్ హీరోలనే తలదన్నుతున్నారు.‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్ 25 కోట్ల పారితోషికం తీసుకుని అందరిని ఆశ్చర్య పర్చాడు.
ఇప్పటి వరకు టాలీవుడ్లో ప్రభాస్ తీసుకున్న 25 కోట్లు అత్యధిక పారితోషికంగా ఉంది.ఇప్పుడు ఆ రికార్డును మహేష్బాబు బ్రేక్ చేయబోతున్నాడు.
మహేష్బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే.వచ్చే సంవత్సరం ఏప్రిల్లో వీరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం అవ్వబోతున్నట్లుగా అధికారికంగానే ప్రకటన వచ్చింది.
ఈ నేపథ్యంలో మహేష్బాబు ఈ సినిమా కోసం ఏకంగా 30 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.‘శ్రీమంతుడు’ సక్సెస్తో మహేష్బాబు క్రేజ్ మరింతగా పెరిగింది.
దాంతో పారితోషికాన్ని కూడా భారీగా పెంచేశాడు.అతి త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలను స్వయంగా మురగదాస్ ప్రకటించనున్నాడు.
తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.