సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్ని విధాలుగా సంపాదిస్తాడో అందరికి తెల్సిందే.హీరోగా, నిర్మాతగా, బ్రాండ్ అంబాసిడర్గా, కంపెనీ అధినేతగా ఇంకా ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో ప్రమోషన్ ద్వారా కూడా సంపాదిస్తున్నాడు.
మొత్తానికి మహేష్బాబు హీరోగా కంటే ఇతర మార్గాల ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్నాడు అనేది చాలా మంది మాట.ఈ లాక్డౌన్లో కూడా మహేష్కు ఆదాయం వస్తూనే ఉంది.
సోషల్ మీడియాలో బ్రాండ్స్ను ప్రమోట్ చేయడం వల్ల కోట్లల్లో ఆదాయం వస్తుంది.తాజాగా ఈయన నెట్ప్లిక్స్లో ప్రసారం అవుతున్న ఒక వెబ్ సిరీస్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్ చేశాడు.
ఆ ట్వీట్లో డార్క్ అనే వెబ్ సిరీస్ అద్బుతంగా ఉందన్నాడు.మొదటి రెండు సీజన్లు చూసిన నేను ఇప్పుడు మూడవ సీజన్ కూడా చూశాను.తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన వెబ్ సిరీస్ అది అంటూ పేర్కొన్నాడు.
సాదారణంగా మహేష్బాబు ఇలాంటి పోస్ట్లు పెట్టడు.కాని సదరు ఓటీటీ వాళ్లు ఇచ్చిన అమౌంట్ కారణంగానే ఆ వెబ్ సిరీస్ గురించిన ట్వీట్ పెట్టి ఉంటాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఆ వాదనను కొందరు కొట్టి పారేస్తున్నారు.
మహేష్బాబు ఈ లాక్డౌన్లో తనకు ఎంతో నచ్చిన వెబ్ సిరీస్ గురించి స్పందించాడు.అంతే తప్ప దాన్ని కూడా కమర్షియల్ అనడం కరెక్ట్ కాదంటూ మహేష్బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.