సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే.ఆయన కుటుంబ సభ్యుల్లో కూడా కరోనా అంటూ వార్తలు వస్తున్నాయి.
కాని అవేవి నిజం కాదు.ఇప్పటి వరకు అలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కనుక మహేష్ బాబు అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.మహేష్ బాబు మాత్రమే కరోనాతో బాధ పడుతున్నాడు.
అది కూడా చాలా తక్కువ లక్షణాలు ఆయనకు ఉన్నాయి.ఆయన స్వల్ప లక్షణాలే ఉన్నాయి కనుక కనీసం ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లో ఉండే జాగ్రత్తలు పాటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఆయన కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.నాలుగు రోజులు అయ్యింది.
మహేష్ బాబు ఆరోగ్య పరిస్థితి ఏంటీ అంటూ చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
సోషల్ మీడియాలో మహేష్ బాబు హెల్త్ అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలో మహేష్ బాబుకు సన్నిహితులు అయిన ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు మాట్లాడుతూ మహేష్ బాబు మొదటి రోజు ఎలా అయితే స్వల్ప లక్షణాలతో ఉన్నారో అదే తరహాలో ఇప్పుడు ఉన్నాడు.ఆయన మరో వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడని అంటున్నారు.
ఒమిక్రాన్ వైరస్ అయ్యి ఉంటుందా అంటే ఆ విషయం లో మాత్రం ఆయన స్పష్టత ఇచ్చేందుకు నిరాకరించాడు.
మొత్తానికి అయితే మహేష్ బాబు కు ఎలాంటి ఇబ్బంది లేదు.ఆయన అభిమానులు అంతా కోరుకుంటున్నట్లుగా ఆరోగ్యంగా ఉన్నారు.ఈ నెల చివరి నుండే సర్కారు వారి పాట చిత్రీకరణ లో పాల్గొంటాడు.
ఆ వెంటనే త్రివిక్రమ్ మూవీ మొదలు పెడతాడు.ఈ ఏడాది చివరి వరకు రాజమౌళి సినిమా ను కూడా షురూ చేసే అవకాశాలు ఉన్నాయి.
మహేష్ బాబు నుండి రాబోతున్న ఈ వినోదపు వింధును ఎంజాయ్ చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా సిద్దంగా ఉండండి అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.