మన బుల్లితెర ప్రేక్షకులను తారక్ తన హోస్టింగ్ తో అలరిస్తున్నాడు.జెమినీ టివిలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ షోకు ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తూ తన యాంకరింగ్ తో ఈ షో ను టాప్ లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.మరో పక్క నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 5 కూడా ప్రసారం అవుతుండడంతో ఇప్పుడు ఈ రెండు షోల మధ్య పోటీ నెలకొంది.
అందుకే ఇంట్రెస్టింగ్ గెస్టులతో ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆకట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది.అందుకోసమే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబును గెస్ట్ గా పిలిచారని తెలుస్తుంది.
మరి ఈ షోలో మహేష్ బాబు పాల్గొన్నట్టు తెలుస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ ఈ షోకు వచ్చారని తెలుస్తుంది.
అన్నపునా స్టూడియోస్ లో నిన్న ఈ షూట్ కంప్లీట్ అయ్యినదని టాక్.
అంతేకాదు ఈసారి తారక్ మహేష్ తో కలిసి హాట్ సీట్ లో కలిసి రచ్చ చేసాడని చెప్పుకుంటున్నారు.
ఈ ఎపిసోడ్ బాగా ఎంటర్టైన్ గా వచ్చిందట.ఇక ఈ ఎపిసోడ్ ను దసరా కానుకగా జెమినీ టివిలో ప్రసారం కాబోతుందట.మరి తారక్ మహేష్ కలిసి బుల్లితెర మీద కనిపిస్తే ఆ రోజు టీఆర్పీ లు బద్దలవ్వడం ఖాయం గా కనిపిస్తుంది.ఇక సినిమాల విషయానికి వస్తే వీరిద్దరూ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.
ప్రెసెంట్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు.పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఇక తారక్ ప్రెసెంట్ ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఇక త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నాడు.