టాలీవుడ్ లో జెనీలియా అంటే తెలియని వారు బహుశా ఉండరేమో.అంతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఆమె సినిమాలు మానేసి చాలా కలం అవుతున్న కూడా జెనీలియా అందం, అభినయం, అల్లరి ఇంకా తెలుగు ప్రేక్షకులు మరచిపోలేక పోతున్నారు.దశాబ్ద కాలం పాటు తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను 2012 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అన్యోన్యంగా ఉండే బాలీవుడ్ కపుల్స్ లో వీరూ ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి.
ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఈమె సినిమాలు ఆపేసిన కూడా ఇంకా టాలీవుడ్ హీరోలతో స్నేహబంధం కొనసాగిస్తూనే ఉంది.ఇక ఈ మధ్యనే జెనీలియా దంపతులు ఒక కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేసారు.‘ఇమేజిన్ మీట్స్‘ పేరుతో ఒక ఫుడ్ బిజినెస్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసారు.
ఇక ఆ బిజినెస్ ప్రమోషన్స్ కూడా ఈ దంపతులిద్దరూ దగ్గరుండి మరి చూసుకుంటున్నారు.వీరు స్టార్ట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ను తమ తమ స్నేహితులకు పంపిస్తున్నారు.
తాజాగా జెనీలియా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు తన ఫుడ్ ఐటమ్స్ ను పంపించింది.ఈ విషయాన్నీ స్వయంగా మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
‘ఇమేజిన్ మీట్స్’ ప్యాకేజ్ తనను బాగా ఇంప్రెస్ చేసిందని.ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనే ఆతృతగా ఉన్నట్టు మహేష్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపారు.అలాగే జెనీలియా దంపతులకు ఫుడ్ ఐటమ్స్ ను పంపించినందుకు థాంక్స్ చెబుతూ ఈ ప్రోడక్ట్స్ ఇమేజ్ ను షేర్ చేసాడు.జెనీలియా ఒక్క దెబ్బకి టాలీవుడ్ లో తన బిజినెస్ ను అందరికి తెలిసేలా చేయడంలో సఫలం అయ్యింది.
ఇక ప్రెసెంట్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.ఇక సంక్రాంతికే విడుదల అవ్వాల్సిన సినిమాను వాయిదా వేశారు మేకర్స్.వచ్చే ఏడాది ఏప్రిల్ 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.
ఇక ఈ సినిమా ఈ నెలలో పూర్తి చేసి నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యాలని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు.