టాలీవుడ్ హీరోలు ఓ వైపు సినిమాలు చేస్తూనే.మరోవైపు రకరకాల బిజినెస్ లు చేస్తున్నారు.
అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇప్పటి హీరోలే కాదు.
నాటి తరం నటులు కూడా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించడమే కాకుండా.పలు వ్యాపారాలు కూడా చేశారు.
అప్పట్లో శోభన్ బాబు రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టి.తిరుగులేని రారాజుగా ఎదిగాడు.
కోట్ల రూపాయలు సంపాదించాడు.అటు మరో సినిమా నటుడు మురళీ మోహన్ సైతం రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టి.
బాగా సక్సెస్ అయ్యాడు.
అటు ప్రస్తుతం తరం సీనియర్ హీరోలు నాగార్జున, చిరంజీవి సైతం పలు వ్యాపారాలు చేస్తున్నారు.
వీరిద్దరు రియల్ రంగంతో పాటు టీవీరంగంలోనూ పెట్టుబడులు పెట్టాడు.ఆ తర్వాత మా టీవీని అమ్ముకున్నారు.
అటు నాగార్జునతో పలు రెస్టారెంట్ వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టాడు.అటు తాజా తరంలోని హీరోలు కూడా బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు.
మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు పలు బిజినెస్ లు చేస్తున్నారు.
అటు మహేష్ బాబు ప్రస్తుతం బిజినెస్ రంగంలో రాణిస్తూ భారీగా డబ్బులు కూడబెడుతున్నాడు.
ఒక్కో సినిమాకు తను రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.అటు సినిమాల లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నారు.అటు ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.అయితే పలు కంపెనీల్లో స్లీపింగ్ పార్ట్ నర్ గా ఉన్నట్లు తెలుస్తోంది.అటు హైదరాబాద్ లో అత్యాధునిక మల్టీప్లెక్సులను నిర్మిస్తున్నాడు.
ఏఎంబీ మల్టీప్లెక్స్ ను నిర్మించాడు.భారీగా లాభాలు వస్తున్నాయి.
మరో మల్టీప్లెక్స్ నిర్మాణం చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడు.అటు తన భార్య నమ్రతతో కలిసి దుస్తుల వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టాడు.వీటితో పాటు పలు రకాల యాడ్స్ చేస్తున్నాడు.సుమారు డజన్ బ్రాండులకు అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు.మొత్తంగా అటు సినిమాలు, ఇటు వ్యాపారంలో బాగా రాణిస్తున్నాడు.