కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది తీవ్రమైన అవస్థలు పడుతున్న విషయం తెల్సిందే.లాక్డౌన్ కారణంగా కార్మికుల నుండి కోటీశ్వరుల వరకు అంతా కూడా నష్టపోతున్నారు.
వందల కోట్ల రూపాయలను కోటీశ్వరులు నష్టపోతూ ఉంటే పేదవారు ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు.ఇక టాలీవుడ్లో కూడా కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గత నెల రోజులుగా లాక్డౌన్ కారణంగా సెలబ్రెటీలు అంతా కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు.
థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేకపోవడంతో విడుదలకు సిద్దం అయిన సినిమాలు కూడా ల్యాబ్ల్లో మూలుగుతున్నాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినీ కార్మికులు కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.కేవలం సినీ కార్మికులు మాత్రమే కాకుండా హీరోలు హీరోయిన్స్ ఇలా అంతా కూడా ఈ లాక్డౌన్ వల్ల నష్టపోతున్నారు.
సినీ కార్మికులు ప్రస్తుతం నష్టపోతూ ఉంటే స్టార్ హీరోలు మాత్రం దీర్ఘకాలికంగా నష్టపోతారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం 30 నుండి 50 కోట్ల మద్య పారితోషికం అందుకుంటున్నారు.ఈ లాక్డౌన్ తర్వాత వారు కొత్తగా చేయబోయే సినిమాలకు పారితోషికం కనీసం 30 శాతం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.మహేష్బాబు వంటి స్టార్స్ తీసుకునే పారితోషికాలు సగానికి పైగా తగ్గినా ఆశ్చర్యం లేదంటున్నారు.
పెద్ద ఎత్తున సినిమాకు సంబంధించిన వ్యాపారాలు పడిపోయే ప్రమాదం ఉంది.అందుకే హీరోల పారితోషికాలు తగ్గుతాయని అంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేష్బాబు సంపాదన అత్యధికంగా ఉంటుందని అంచనా.ఆయన హీరోగానే కాకుండా బ్రాండ్ అంబాసిడర్గా, ఏఎంబీ మల్టీప్లెక్స్ అధినేతగా కూడా వ్యవహరిస్తున్నాడు.ఈ మూడు రంగాల్లో కూడా ఆయన తీవ్రమైన నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు.గత ఏడాది 100 కోట్ల మేరకు మహేష్కు వస్తే ఈ ఏడాది అందులో సగం అయినా వస్తుందనే నమ్మకం లేదు.
వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.అందువల్ల టాలీవుడ్లో కరోనా వల్ల అత్యధికంగా ఎఫెక్ట్ అయ్యే హీరో మహేష్బాబుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.